అజెండా దాచిపెట్టి... ఆమోదింపజేశారు..!

21 Feb, 2019 17:20 IST|Sakshi

సాక్షి, కృష్ణా : మచిలీపట్నం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లకు అజెండా అందించడంలో అధికార టీడీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అజెండాలోని అంశాలను ముందుగా తెలియనివ్వడంలేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా ఇవ్వకుండా చివరివరకు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిసల్‌ చైర్మన్‌ బాబా ప్రసాద్‌ అజెండాలోని అంశాలపై ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదం తెలిపారు.

మరిన్ని వార్తలు