‘ఓ పత్రికా యజమానితో కలిసి చంద్రబాబు కుట్ర’

8 Apr, 2019 12:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు కారణం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి తనను చూసి ఓట్లు వెయ్యమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని.. దానిని చంద్రబాబు నాయుడు తప్పుపట్టడం దారుణమన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో అబద్ధాల పుట్టని.. అమలుకు వీలుకాని హామీలను ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని అన్నారు.

చంద్రబాబుకు విశ్వనీయత లేదని, ఎన్నిసార్లు యూటర్న్‌ తీసుకున్నారో ప్రజలకు తెలుసని గుర్తుచేశారు. తన అనుకూల మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని రామచంద్రయ్య విమర్శించారు. ఓ పత్రికా యజమానితో కలిసి చంద్రబాబు ఏవిధంగా కుట్ర పన్నుతున్నారో సమాజానికి తెలిసిపోయిందని వివరించారు. దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలను తొలగించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్‌ విసిరారు. డ్వాక్రా పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నరు. 

మరిన్ని వార్తలు