వైఎస్‌ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలు

15 May, 2019 10:10 IST|Sakshi

సాక్షి, పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన రెండోరోజు పులివెందులలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8.30 నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. అలాగే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆయనను కలిసి కౌంటింగ్‌పై చర్చించారు. ఇవాళ సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్‌ హాలులో మైనార్టీ సోదరులు ఇచ్చే ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. గురువారం కూడా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పులివెందులలో వైఎస్‌ జగన్‌ పర్యటన

కాగా వైఎస్‌ జగన్‌ మంగళవారం రాత్రి పులివెందుల చేరుకున్న విషయం తెలిసిందే. కడప విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఆయనకు పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పులివెందుల చేరుకున్నారు. దారిపొడవునా వేచి వున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. 

మరిన్ని వార్తలు