సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర కార్యనిర్వహక రాజధానిగా విశాఖను గుర్తించినందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా సోమవారం విశాఖలో 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.