బాడ్మింటన్ క్రీడాకారులకు నగదు పురస్కారాలు

17 Mar, 2015 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ:  బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మంగళవారం బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లకు  నగదు పురస్కారాలను ప్రకటించింది.    అంతర్జాతీయ వేదికల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వరల్డ్ నెం. 2  సైనానెహ్వాల్, కామన్ వెల్త్  గేమ్స్ లో ఛాంపియన్గా నిలిచిన కశ్యప్ ఇద్దరికీ చెరి అయిదు లక్షల రూపాయల బహుమతిని  ఇస్తున్నట్టుగా  బీఎఐ అధ్యక్షులు అఖిలేష్ దాస్  ప్రకటించారు.
 గత జనవరిలో  లక్నో లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్  పోటీల్లో  ఈ ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలసిందే.

 

మరిన్ని వార్తలు