దబంగ్‌ ఢిల్లీకి  పదో విజయం

24 Dec, 2018 05:43 IST|Sakshi

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 37–31తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందింది. ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన దబంగ్‌ ఢిల్లీ తొలి సగం ముగిసే సమయానికి 20–14తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కనబరిచి చివరకు విజయం సాధించింది. ఢిల్లీ తరఫున మిరాజ్‌ షేక్‌ 13 పాయింట్లతో మెరవగా... బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మణీందర్‌ 9, భూపేందర్‌ 5 పాయింట్లు సాధించారు. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్‌ తలైవాస్, బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనున్నాయి.   

మరిన్ని వార్తలు