160 కోట్ల మంది చూశారు!

17 Sep, 2019 02:56 IST|Sakshi

వన్డే వరల్డ్‌ కప్‌ సూపర్‌ సక్సెస్‌   

దుబాయ్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ విజేతగా నిలిచిన ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ వీక్షకాభిమానంలో గత టోరీ్నల రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో 160 కోట్ల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2015 ప్రపంచ కప్‌తో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ కావడం విశేషం. టీవీలతో పాటు డిజిటల్‌ వేదికపై ప్రజలు క్రికెట్‌ చూసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించారు. భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను గరిష్టంగా టీవీల్లోనే 27.3 కోట్ల మంది వీక్షించగా మరో 5 కోట్ల మంది డిజిటల్‌ వేదికపై చూశారు.   

మరిన్ని వార్తలు