తెలంగాణ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ జట్టుకు సన్మానం

17 Feb, 2020 10:09 IST|Sakshi

హైదరాబాద్‌: జాతీయ మాస్టర్స్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో రాణించిన తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్‌లో నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమంలో తెలంగాణ మాస్టర్స్‌ గేమ్స్‌ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రావు, అఖిల భారత మాస్టర్స్‌ గేమ్స్‌ కన్వీనర్‌ సంజయ్‌ల క్రీడాకారులను సన్మానించారు.

ఈ సందర్భంగా జట్టు సభ్యులు వేణు ముప్పాల, జ్ఞాన ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ పోటీల్లో కాంస్యం నెగ్గడం ఆనందంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే పోటీల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెప్పారు. 

మరిన్ని వార్తలు