భారత్‌ క్లీన్‌స్వీప్‌

9 Mar, 2017 00:20 IST|Sakshi

భోపాల్‌: బెలారస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత్‌ 3–1 గోల్స్‌ తేడాతో విజయాన్ని అందుకుంది. ఆట ఆరో నిమిషంలో వందన కటారియా చేసిన గోల్‌ తో భారత్‌ ఖాతా తెరిచింది.

15వ నిమిషం లో గుర్జిత్‌ కౌర్‌ భారత్‌కు రెండో గోల్‌ను అందించింది. బెలారస్‌ ప్లేయర్‌ యూలియా 52వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. అయితే 55వ నిమిషంలో భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గోల్‌తో భారత్‌ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. 

మరిన్ని వార్తలు