క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌

7 Aug, 2019 07:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత పురుషుల జట్టు అండర్‌–23 ఆసియా వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌ దశలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడింది. భారత్‌ 2–3 (25–15, 23–25, 23–25, 25–23, 13–15)తో థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసినప్పటికీ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్‌ చేరింది.

మరిన్ని వార్తలు