భారత్‌కు రెండో గెలుపు

9 Feb, 2017 00:15 IST|Sakshi

కొలంబో: ఐసీసీ మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. థాయ్‌లాండ్‌ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.

భారత బౌలర్లు మాన్సి జోషి (3/4), దీప్తి శర్మ (2/8), పూనమ్‌ యాదవ్‌ (2/10), రాజేశ్వరి (2/18) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌ 29.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ 12.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 59 పరుగులు చేసి గెలిచింది.

మరిన్ని వార్తలు