భారత జట్టు ఫిజియోగా ఫర్‌హర్ట్

25 Jul, 2015 00:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కొత్త ఫిజియోగా ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిక్ ఫర్‌హర్ట్ ఎంపికయ్యారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నితిన్ పటేల్ స్థానంలో ఫర్‌హర్ట్‌ను బీసీసీఐ నియమించింది. వచ్చే నెలలో జరిగే భారత్, శ్రీలంక టెస్టు సిరీస్‌నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. ఫిజియోగా దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ప్యాట్రిక్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు పని చేశాడు. టీమ్ మసాయర్‌గా అరుణ్ కనడేను ఎంపిక చేయగా, ఇటీవల జింబాబ్వే సిరీస్ నుంచే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణుడిగా శంకర్ బసు కూడా జట్టుతో చేరాడు. ఈ ముగ్గురికి బోర్డు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చింది.

మరిన్ని వార్తలు