ఫైనల్లో ప్రాంజల జంట

25 May, 2018 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో ప్రాంజల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరింది. స్పెయిన్‌లో గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ ప్రాంజల (భారత్‌)–రలుకా సెర్బన్‌ (రొమేనియా) ద్వయం 6–0, 6–4తో నాలుగోసీడ్‌ పొలీనా లేకినా (రష్యా)– ఇసాబెల్లా షినికోవా (బల్గేరియా) జంటపై గెలుపొందింది.    

మరిన్ని వార్తలు