రష్మిక అలవోక విజయం

21 Oct, 2023 01:13 IST|Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోరీ ్న లో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక 6–1, 6–3తో నాలుగో సీడ్‌ హిరోకో కవాటా (జపాన్‌)పై గెలిచింది. 70  నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఎనిమిది ఏస్‌లు సంధించడం విశేషం.   

మరిన్ని వార్తలు