అనుష్కను చూసి భయపడ్డా: కోహ్లి

3 Mar, 2018 14:07 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. భార్య అనుష్క శర్మను చూసి భయపడ్డాడట. ఇటీవలే అనుష్కను వివాహమాడిన కోహ్లి.. అప్పుడే ఆమెను చూసి భయపడటం ఏమిటా అనుకుంటున్నారా. ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండీ.. రీల్‌ లైఫ్‌లో.  అనుష్క శర్మ నటించిన తాజా చిత్రం పరీలో ఆమె హారర్‌ నటనను చూసి కోహ్లి జడుచుకున్నాడట.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సినిమా వీక్షించిన తర్వాత కోహ్లి ట్విట్టర్‌లో పంచుకున్నాడు.' అనుష్క సినిమా పరీ చూశా. గతంలో ఎప్పుడూ చూడని నా భార్య యాక్షన్‌ను ఈ సినిమాలో చూశా. ఇది కచ్చితంగా ఆమెకు అత్యుత్తమ సినిమానే. నేను చూసిన సినిమాల్లో ఇదొక బెస్ట్‌ సినిమా. కాకపోతే ఆ సినిమాలో అనుష్క నటను చూసి భయపడ్డా. హారర్‌ సన్నివేశాల్లో అనుష్క విపరీతంగా భయపెట్టింది' అని కోహ్లి పేర్కొన్నాడు. గురువారం(మార్చి 2) నాడు పరీ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు