మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

29 Jul, 2019 09:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాగోస్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ క్లాసిక్స్‌ టోర్నీలో తెలుగు అమ్మాయి మనీషా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో టాప్‌సీడ్‌ మనీషా–అర్జున్‌ (భారత్‌) జంట 21–16, 21–17తో శ్లోక్‌ రామచంద్రన్‌–రుతుపర్ణ (భారత్‌) జోడీని ఓడించింది. మరోవైపు మహిళల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ దండు పూజ–సంజన (భారత్‌) ద్వయం 21–18, 8–21, 21–14తో టాప్‌ సీడ్‌ ఎర్‌సెటిన్‌ బెంగిసు–ఇన్సి నజ్లికాన్‌ (టర్కీ) జోడీపై గెలుపొందింది.  

మరిన్ని వార్తలు