ఏషియన్‌ గేమ్స్‌-2018 : టెన్నిస్‌ సెమీస్‌లో అంకితా రైనా

22 Aug, 2018 11:13 IST|Sakshi
అంకిత రైనా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తున్న టెన్నిస్‌ స్టార్‌ అంకిత రైనా భారత్‌కు మరో పతకం అందించేందుకు అడుగు దూరంలో నిలిచారు. ఏషియన్‌ గేమ్స్‌-2018లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గెలుపొంది సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పాలెంబర్గ్‌లో చైనా ప్లేయర్‌ యూడిస్‌ చోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట తడబాటుకు గురైన అంకిత అనంతరం దూకుడుగా ఆడి 6-4తో మొదటి సెట్లో గెలుపొందారు. రెండో సెట్లో 6-1 తో గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు.

ఏషియన్‌ గేమ్స్‌-2018లో నాలుగోరోజు భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ పోటీల్లో మనుభాకర్‌, రాహి సర్నోబట్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. 8 మంది ఫైనలిస్టుల్లో చోటు సంపాధించారు. కాగా, 16 ఏళ్ల మనుభాకర్‌ 593 పాయింట్లతో టాప్‌లో, రాహి 580 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.

>
మరిన్ని వార్తలు