దిగ్గజాల సరసన ధోని

15 Jul, 2018 08:49 IST|Sakshi

10వేల మార్క్‌ దాటిన రెండో వికెట్‌ కీపర్‌ ధోని

లార్డ్స్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ 10 వేల పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సచిన్‌ టెండూల్కర్‌, ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీలు ధోని కన్న ముందు ఈ మైలురాయిని అందుకున్నారు.

ఇక ఓవరాల్‌గా ఈ ఫీట్‌ అందుకున్న 12వ బ్యాట్స్‌మన్‌గా ఈ 36 ఏళ్ల ఆటగాడు నిలిచాడు. ఈ జాబితాలో 18,426 పరుగులతో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో  ఉన్నాడు. ఆ తర్వాత సంగక్కర(14,234), రికీ పాటింగ్‌ (13,704), జయసూర్య(13,430), మహేళ జయవర్ధనే (12,650), ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌(11,739), జాక్వస్‌ కల్లీస్‌ (11,579), సౌరవ్‌ గంగూలీ(11,363), ద్రవిడ్‌(10,889), బ్రియన్‌ లారా (10,405), దిల్షాన్‌ (10,290)లున్నారు.

మరిన్ని వార్తలు