డబుల్స్‌ ఫైనల్లో పేస్‌ జంట

24 Jun, 2017 01:00 IST|Sakshi
డబుల్స్‌ ఫైనల్లో పేస్‌ జంట

ఎగాన్‌ ఇల్‌క్లే ట్రోఫీ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆదిల్‌ షమస్దీన్‌ (కెనడా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో పేస్‌–షమస్దీన్‌ ద్వయం 6–4, 7–6 (7/2)తో జాన్‌ మిల్‌మన్‌–లూక్‌ సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు బర్మింగ్‌హామ్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్‌)–కోకో వాండెవాగె (అమెరికా) జంటకు క్వార్టర్‌ ఫైనల్లో వాకోవర్‌ లభించడంతో సెమీఫైనల్‌కు చేరింది.

మరిన్ని వార్తలు