చండిమల్ సెంచరీ

16 Oct, 2015 04:49 IST|Sakshi
చండిమల్ సెంచరీ

గాలె: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. కరుణరత్నె (354 బంతుల్లో 186; 16 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు చండిమల్ (298 బంతుల్లో 151; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 152.3 ఓవర్లలో 484 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (48) ఫర్వాలేదనిపించాడు. బిషు 4, టేలర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 2 వికెట్లకు 66 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (15 బ్యాటింగ్), శామ్యూల్స్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (19), హోప్ (23) నిరాశపర్చారు. ఈ రెండు వికెట్లు హెరాత్ తీశాడు.
 

మరిన్ని వార్తలు