తలైవాస్‌ మళ్లీ ఓడింది

4 Sep, 2017 01:27 IST|Sakshi
తలైవాస్‌ మళ్లీ ఓడింది

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈ ఏడాది ప్రవేశించిన సచిన్‌ జట్టు తమిళ్‌ తలైవాస్‌ నిరాశజనక ప్రదర్శనను కొనసాగిస్తుంది. జోన్‌ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో తలైవాస్‌ 25–29 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో పరాజయం చవిచూసింది. లీగ్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన తమిళ్‌ తలైవాస్‌కు ఇది ఆరో ఓటమి కాగా... ఒకే ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది. మరోవైపు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగాల్‌ వారియర్స్‌ ఆరో విజయాన్ని సాధించింది. రైడింగ్‌లో మణిందర్‌ సింగ్‌ (6) రాణించగా, డిఫెండర్‌ సుర్జీత్‌ సింగ్‌ టాకిల్‌లో 4 పాయింట్లు చేశాడు.

జాంగ్‌ కున్‌ లీ 4, వినోద్‌ కుమార్, రాన్‌ సింగ్‌ చెరో 3 పాయింట్లు సాధించారు. తలైవాస్‌ జట్టు తరఫున అమిత్‌ హుడా 4, ప్రపంజన్, దర్శన్, అజయ్‌ ఠాకూర్‌ తలా 3 పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన పోరులో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 31–25తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్‌ పింక్‌పాంథర్స్, బెంగాల్‌ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్‌ తలపడతాయి.
 

మరిన్ని వార్తలు