పోరాడి ఓడిన సాకేత్

25 Jun, 2015 02:32 IST|Sakshi

లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన తెలుగు తేజం సాకేత్ మైనేని రెండో రౌండ్‌లో నిష్ర్కమించాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సాకేత్ 6-7 (5/7), 6-3, 7-9తో కెన్నీ డి షెప్పర్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్‌లోనే ఓడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు