రన్నరప్ సానియా జోడి

17 Mar, 2014 01:26 IST|Sakshi
రన్నరప్ సానియా జోడి

బీఎన్‌పీ పారిబా ఓపెన్ టోర్నీ
 ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్‌పీ పారిబా ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
 
 ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా జోడి 6-7 (5/7), 2-6తో టాప్‌సీడ్ సై సువీ (తైవాన్)- పెంగ్ షువాయ్ (చైనా) జంట చేతిలో  ఓటమి పాలైంది. తొలి సెట్‌లో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సానియా జంట ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. రెండో సెట్‌లో మాత్రం సై సువీ ద్వయం పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది.

మరిన్ని వార్తలు