సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌

29 Dec, 2016 00:00 IST|Sakshi

చెన్నై: జాతీయ సీనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... పురుషుల విభాగంలో మాత్రం క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ 25–23, 25–18, 25–6తో తెలంగాణ జట్టును ఓడించగా... పురుషుల జట్టు 20–25, 20–25, 23–25తో రైల్వేస్‌ చేతిలో పోరాడి ఓడింది.
 

మరిన్ని వార్తలు