విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో ఇక్కడ డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్కు మొగ్గుచూపాడు. ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ గురువారం ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దయ్యింది. జల్లులతో ప్రారంభమైన వర్షం చాలాసేపు పడటంతో తొలి రోజు ఆటను నిర్వాహకులు పూర్తిగా రద్దు చేశారు. వాతావరణ ప్రభావంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఉదయం 8 గంటలకే చేరుకున్న ఇరు జట్ల క్రీడాకారులు చాలాసేపు వేచి చూశారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు.