యూపీ యోధా, తమిళ్‌ తలైవాస్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

16 Dec, 2018 02:18 IST|Sakshi

పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తొలుత యూపీ యోధా, తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరు 25–25తో ‘డ్రా’అయింది. యోధా తరఫున ప్రశాంత్‌ 12 పాయింట్లతో మెరిశాడు. యు ముంబా, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ కూడా 35–35తో ‘టై’ అయింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడనున్నాయి.    

మరిన్ని వార్తలు