బాత్రూమ్స్‌ కట్టిన త్రిష

31 Dec, 2017 10:17 IST|Sakshi

కాంచీపురం (తమిళనాడు) : నటి త్రిష బాత్రూమ్స్‌ కట్టారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం.

త్రిష యునెస్కోకు భారత్‌ తరఫున అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్‌కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు