-
ఒక్కరోజులో 3డీ ప్రింటింగ్ బాత్రూం
సింగపూర్: ఒకే రోజులో మొత్తం బాత్రూం వ్యవస్థను శాస్త్రవేత్తలు త్రీడీ సాంకేతికతతో రూపొందించారు. అందులో డ్రైనేజీ వ్యవస్థ, పైపులను నిర్మించారు. అందులో సింక్, అద్దం, షవర్, టైల్స్, గోడలు, ఫ్లోరింగ్, టాయిలెట్ ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసి ఒక్క రోజులోనే బాత్రూం మొత్తాన్ని వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. కాంక్రీట్ మిశ్రమాన్ని రోబో.. పొరలుపొరలుగా పోస్తూ బాత్రూంను పోతపోస్తుంది. సింగపూర్ లోని నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ సాంకేతికత ద్వారా సంప్రదాయ బాత్రూంల నిర్మాణం కన్నా 30 శాతం తక్కువ వ్యవధిలో నిర్మించవచ్చని తెలిపారు. కాంక్రీట్తో నిర్మించే వాటితో సమానంగా దృఢంగా ఉంటుందని చెప్పారు. -
ఈ వార్త చదివేందుకు కూడా బాగోదేమో..!
న్యూయార్క్ : ఓ ప్రయాణీకుడి చేష్టలకు గాల్లో ఎగురుతున్న విమానాన్ని అనూహ్యంగా దించివేశారు. అనంతరం అందులోని ప్రయాణీకులందరిని దింపేసి వారికి హోటల్స్లో విడిది ఏర్పాటు చేసి విమానాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆలస్యంగా బయలుదేరి ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చారు. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన విమానం 895 చికాగో నుంచి హాంకాంగ్ బయలుదేరింది. అయితే, ప్రయాణం మధ్యలో ఉండగా అందులోని ఓ ప్రయాణీకుడి టాయిలెట్కు వెళ్లాడు. అనంతరం విచిత్రంగా ప్రవర్తిస్తూ మలాన్ని విమానం మొత్తానికి పూయడమే కాకుండా అందులోని ప్రయాణీకులకు కూడా అంటించాడు. దాంతో విమానంలో ఓ చెప్పవీలుకానీ పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో పాలుపోక ప్రయాణీకులు గందరగోళానికి గురవుతుండగా అప్పటికప్పుడు అలస్కాలో విమానాన్ని దించివేశారు. అందులో వారందరిని ఎయిర్పోర్ట్లోని హోటల్స్కు తరలించి అనంతరం విమానం మొత్తం శుభ్రం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ఆ ప్రయాణీకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అయితే అతడు ఎందుకు విమానంలో అలా చేశాడో అని తెలుసుకునేందుకు మానసిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. దీనిపై ఎఫ్బీఐ అధికారులు కూడా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. -
బాత్రూమ్స్ కట్టిన త్రిష
కాంచీపురం (తమిళనాడు) : నటి త్రిష బాత్రూమ్స్ కట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం. త్రిష యునెస్కోకు భారత్ తరఫున అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు. -
90 శాతం మరుగుదొడ్లు పూర్తి
ఖిల్లాఘనపురం : మండలంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువద్దామని జెడ్పీసీఈఓ లక్షీ్మనారాయణ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ రమేష్గౌడ్, ఎంపీడీఓ రెడ్డయ్యలతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖిల్లాఘనపురం మారుమూల మండలమైనప్పటికీ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే 90 శాతం పూర్తయిందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు వందశాతం పూర్తి చేయాలన్నారు. బిల్లులకు ఇబ్బంది కలగకుండా గ్రామ కమిటీల ద్వారా నేరుగా చెల్లిస్తామని, హౌసింగ్ పథకంలో కొంత వరకు బిల్లులు వచ్చిన వారికి మిగతా బిల్లులు అందజేస్తామన్నారు. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోపు పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవీందర్, పీఆర్ఏఈ రమేష్నాయుడు, ఈఓపీఆర్డీ వినోద్కుమార్గౌడ్, ఏపీఓ సురేష్, ఘనపురం సర్పంచ్ సౌమ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
మరుగుదొడ్లను పరిశీలించిన సింగపూర్ బృందం
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో సింగపూర్ బృందం సోమవారం మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించింది. సింగపూర్ బృందంతో పాటు స్థానిక అధికారులు అందులో పాల్గొన్నారు. వచ్చే 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతామని పంచాయతీ రాజ్ కమిషనర్ వి.ఆంజనేయులు అన్నారు. (సత్తెనపల్లి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement