ఖానాపూర్‌లో కార్డెన్‌ సెర్చ్‌

5 Apr, 2017 12:30 IST|Sakshi
నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 53 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఓ ట్రాక్టర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లక్ష రూపాయల విలువైన కలప, పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 
మరిన్ని వార్తలు