పెద్దపల్లి జిల్లాలో కార్డెన్‌ సెర్చ్‌

8 Apr, 2017 11:08 IST|Sakshi
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం శాంతినగర్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సోదాల్లో 1000 లీటర్ల బెల్లం పానకంతో పాటు నాలుగు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా బట్టీలు పెడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 
మరిన్ని వార్తలు