హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు మంగళవారం ఫోన్ చేశారు. నగరంలో పెద్ద ఎత్తున చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్ ఆరా తీశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్కు ఆదేశించారు.
నగరంలో రెండోరోజు కొనసాగుతున్న కూల్చివేతలపై సీఎంకు కేటీఆర్ వివరించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కేసీఆర్ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించనున్నారు.