నా భర్త ఆత్మహత్యకు ఆ మంత్రే కారణం

18 Jul, 2016 15:43 IST|Sakshi
నా భర్త ఆత్మహత్యకు ఆ మంత్రే కారణం

బెంగళూరు: మంగళూరు డీఎస్పీ గణపతి ఆత్మహత్య చేసుకోవడానికి కర్ణాటక మంత్రి జార్జ్ కారణమని ఆయన భార్య పావని ఆరోపించారు. మంత్రి జార్జ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఆమె సీఐడీకి లేఖ రాశారు. కాగా మంత్రి జార్జ్ తో పాటు ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల గణపతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రతిపక్ష నేత జగదీష్‌ శెట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం శనివారం మడికేరిలోని రంగసముద్రంలో ఉన్న డీఎస్పీ గణపతి నివాసానికి చేరుకుని ఆయన భార్య పావన, కుమారుడు నిహాల్, తండ్రి కుశాలప్పలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గణపతి భార్య పావన తన ఆవేదనను బీజేపీ నేతల బృందానికి వివరించారు. తన భర్త బలవన్మరణానికి పాల్పడినా ఇప్పటి వరకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పారు. గణపతి ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జ్‌ రాజీనామా చేసే వరకు అసెంబ్లీలో అహోరాత్రుల్లు ధర్నాను కొనసాగిస్తామని, సోమవారం నుంచి తిరిగి మా ధర్నా ప్రారంభమవుతుందని జగదీష్ శెట్టర్ చెప్పారు.

మరిన్ని వార్తలు