బెంగళూరు : కర్ణాటకలోని మైసూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, టెంపో ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వీరంతా తమిళనాడులోని ఓ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.