కరీంనగర్‌లో భారీ చోరీ

2 Jan, 2017 11:02 IST|Sakshi
కరీంనగర్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శ్రీకాంత్ ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలతో పాటు టీవీ ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు