క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు: బీజేపీ

23 Feb, 2015 01:37 IST|Sakshi

న్యూఢిల్లీ: బురారీ ఘటనకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ని బీజేపీ నిలదీసింది. ఆప్ ఎమ్మెల్యేల ప్రమేయం అధికారంలోకి వచ్చామనే వారి అహంకారానికి నిదర్శనమని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ ఆరోపించారు.

శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గూండాగిరీకి పాల్పడిన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో తన వైఖరేమిటో సీఎం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు