మరో ఐదు నెలల్లో ప్రారంభం!
ఎవరి సాయమూ అవసరం లేదు
యునెస్కో సహకారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
{పతిరూపాలకు బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుళ్లు
వెల్లడించిన డెరైక్టర్ జనరల్
న్యూఢిల్లీ: అంధులు, చూపు మందగించిన వారి సౌలభ్యం కోసం జాతీయ మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఆ గ్యాలరీలోని కళారూపాలను వారు చేతితో తాకగానే వాటి చారిత్రక ప్రాముఖ్యతను తెలిపేవిధంగా ఆడియో గైడ్స్(మార్గదర్శకాలను) రూపొందించనున్నారు. దీంతో అంధులు ఇకనుంచి మరొకరి సాయం లేకుండానే వస్తువుల సమాచారం తెలుసుకోవచ్చు. అయితే రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ మ్యూజియంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవు. యునెస్కో సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న దీనిని ‘నేషనల్ మ్యూజియం యాక్సెస్ ప్రాజెక్టు ఫర్ పీపుల్ విత్ డిజెబిలిటీస్’ కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ ప్రత్యేక విభాగాన్ని మరో ఐదు నెలల్లో ప్రారంభించనున్నట్లు మ్యూజియం డెరైక్టర్ జనరల్ వేణు వాసుదేవన్ తెలిపారు.
చారిత్రక సమాచారాన్ని తెలియజేసేవిధంగా ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుల్ను ప్రతిరూపాలకు ఏర్పాటు చేస్తామని అసిస్టెంట్ క్యూరేటర్(విద్యా విభాగం) రీగె షిబా తెలిపారు. గ్యాలరీలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన కళారూపాల సమాచారాన్ని అందించాలని మ్యూజియంలోని వివిధ విభాగాలను కోరినట్లు చెప్పారు. అంతేకాకుండా అంధుల కోసం ప్రత్యేకంగా ఆడియో గైడ్స్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వస్తువులపై ఉన్నబ్రెయిలీ లిపిలోని సంఖ్యలను తాకగానే ఈ ఆడియో గైడ్స్ వాటి చారిత్రక సమాచారాన్ని వివరిస్తాయి.
అంధుల కోసం మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీ
Published Mon, Feb 23 2015 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement