అగ్ని ప్రమాదం: 10 మందికి గాయాలు

24 Jul, 2015 22:50 IST|Sakshi

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరులో ఓ ఇంట్లో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అక్రమంగా నిల్వ ఉంచిన డీజిల్తో ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు