ప్రయివేట్‌ బస్సు బోల్తా, 15మందికి గాయాలు

3 Aug, 2019 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సు శనివారం ఉదయం జూపార్క్‌ సమీపంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత‍్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్‌ మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు