ఖమ్మం జిల్లాలో 15 కేజీల గంజాయి స్వాధీనం

30 Jul, 2014 09:10 IST|Sakshi

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో బుధవారం పోలీసులు తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద దాదాపు 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం అతడి వద్దనున్న సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు