చిలుకూరు ఆలయంలో చోరీ

30 Jul, 2014 09:42 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా చిలుకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో దుంగడులు చోరీకి పాల్పడ్డారు. స్వామివారి వెండి ఆభరణాలను  దోచుకెళ్లారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గమనించిన ఆలయ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చోరీకి గురైన వెండి ఆభరణాల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అంచనా.

 

మరిన్ని వార్తలు