370 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

15 Apr, 2015 18:23 IST|Sakshi

వరంగల్(ఖిల్లా వరంగల్): వరంగల్ నగరంలోని శివ నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 370 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గణపురం రమేష్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని నిల్వచేసినట్లు డిప్యూటి తహసీల్దార్ రత్నవీర తెలిపారు. బియ్యాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు