4న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన

18 May, 2016 02:55 IST|Sakshi

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్‌సీ) జూన్ 4న రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. ఈ మేరకు పీఎస్‌సీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాచారం అందించింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గడిచిన ఐదేళ్లలో నీటి సామర్ధ్యాల వివరాలు, ఈ ఏడాది పరిస్థితులు, గోదావరి, కృష్ణా అనుసంధానానికి ఉన్న అభ్యంతరాలతో పాటు నదుల కాలుష్యానికి కేటాయించిన నిధులు తదితర అంశాలపై ఈ కమిటీ ఆరా తీసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు