'దేశాన్ని ఎలా నడపాలో చూపించారు'

25 Dec, 2014 14:24 IST|Sakshi

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న రావడం మా అందరికి గర్వకారణంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మురళీధర్రావు తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో పాల్గొన్న మురళీధర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఎలా ముందుకు నడపాలో వాజ్పేయి చూపించారని చెప్పారు. అట్టడుగు వర్గాలను మొట్టమొదట వాజ్పేయి గుర్తించారని గుర్తు చేశారు.అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు