కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

5 Jul, 2017 14:25 IST|Sakshi
వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీహెచ్‌డీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 
ఈ క్రమం‍లో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 
మరిన్ని వార్తలు