అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు: అమృత

8 Mar, 2020 10:36 IST|Sakshi

సాక్షి, నల్గొండ : ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు. ప్రణయ్‌ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని పేర్కొన్నారు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు.

కాగా, శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

చదవండి : అమృతా ప్రణయ్‌ తండ్రి ఆత్మహత్య..!

మారుతీ రావు షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?

అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్‌

మరిన్ని వార్తలు