స్వగ్రామానికి జవాన్ మృతదేహం

6 Apr, 2015 17:37 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: కశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి రాష్ట్రానికి చెందిన జవాను శివశంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి జవాన్ సొంత ఊరు అయిన మహాబూబ్‌నగర్ జిల్లాలోని కమరం గ్రామానికి తీసుకెళ్లనున్నారు. సొంత గ్రామంలో మిలటరీ లాంఛనాల ప్రకారం మంగళవారం ఆయన అంత్యక్రియలు జరుపుతారు.

మరిన్ని వార్తలు