చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

12 Feb, 2015 15:46 IST|Sakshi

డిచ్‌పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌లో ఉంటే విదేశాల్లో ఉన్నట్లే ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌వీ యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.

మరిన్ని వార్తలు