సాక్షి, హైదరాబాద్: భద్రాచలం రెవిన్యూ డివిజన్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ తాజాగా డిమాండ్ చేసింది. 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపే వరకు పార్టీ ఉద్యమిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ప్రకటించారు. దీనిపై పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీ నేతలు సుధీష్ రాంబొ ట్ల, కోటేశ్వరరావులతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.