'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'

12 Feb, 2015 14:43 IST|Sakshi
'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

విద్యుత్, నదీజలాల సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్, కోర్టులను ఎందుకు ఆశ్రయించరని ప్రశ్నించారు. బీజేపీతో కలిసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నారని మధుయాష్కీ అన్నారు.

>
మరిన్ని వార్తలు