రేపు కలెక్టర్ల సదస్సు

4 Feb, 2017 04:01 IST|Sakshi
రేపు కలెక్టర్ల సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాల కలెక్టర్లతో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. అసైన్డ్‌ భూములు, సాదా బైనామాలు, కొత్త జిల్లాల కలెక్టరేట్లు, పోలీసు కాంప్లెక్సుల నిర్మాణానికి స్థల సేకరణ, యాదవుల స్థితిగతులు తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు